పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో భారత్కు భారీ ఊరట లభించింది. రష్యా ముడి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాత్కాలికంగా 30 రోజుల పాటు రష్యా ఆయిల్ కొనేందుకు భారత్కు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ఆంక్షలు సడలిస్తున్నామని..ఇరాన్ చర్యల వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అన్న బెసెంట్.. భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇరాన్ యుద్ధ సంక్షోభంలో భారత్కు బిగ్ రిలీఫ్.
169
previous post




Total views : 47778