కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి కేంద్రం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.కేరళలోని ఎర్నాకుళంలో దాదాపు రూ.10,800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు . జూన్ 2024లో కేరళ శాసనసభ ఈ మార్పును కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చే ప్రతిపాదనను ఆమోదించింది. కొచ్చిలో జరిగిన అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మలయాళీ సంస్కృతి మరియు గుర్తింపుకు అనుగుణంగా రాష్ట్రానికి ఇప్పుడు సరైన పేరు వచ్చిందని అన్నారు. ఈ సంధర్భంగా షోరనూర్-నిలంబూర్ రోడ్ రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ ముఖ్యమైన రైలు విభాగం విద్యుదీకరణ వల్ల షోరనూర్లో లోకోమోటివ్ మార్పుల అవసరాన్ని తొలగించడం ద్వారా వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ,స్థిరమైన రైలు కార్యకలాపాలు సాధ్యమవుతాయి. కేరళ, తమిళనాడు మధ్య రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తూ పాలక్కాడ్, పొల్లాచి మధ్య కొత్త రైలు సర్వీసును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సర్వీసు రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రోజువారీ ప్రయాణికులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చి రిఫైనరీలో పాలీప్రొఫైలిన్ యూనిట్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి కేంద్రం ఆమోదం
136




Total views : 47766