125
ప్రముఖ దివ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాల జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా విస్ర్తత ఏర్పాట్లు చేశారు. భక్తులకు, దీక్షపరుల కోసం ఏడు చోట్ల వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు ప్రసాద కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఆలయంలో అర్జీత సేవలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు.





Total views : 47727