చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ , మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ కు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణ అరికట్టడం పై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ర్యాలీ ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలుఈ కార్యక్రమo ముఖ్య ఉద్దేశ్యం అనధికారిక డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణా పై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. రోగాలకు వాడే మందులను వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య రీత్యా వాడాలని వాటికి బానిసలుగా మారితే వాటివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి యువత వారి బంగారు జీవితాన్ని పాడు చేసుకోరాదని సూచించారు. స్కూల్స్ , కాలేజీలలో ఎవరైనా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాల వాడకం నుండి వారిని బయటకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు , స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంఘాలు సమభాగంగా మత్తుకు బానిసలైన వారి కేసులు తమ ద్రుష్టికి వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వాటి వినియోగం నుండి బయటకు తీసుకుని రావడానికి కృషి చేయాలని అన్నారు. స్కూల్, కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి మత్తు నుంచి విముక్తి కలిగించుట కొరకు సందేహాలు, సూచనల కొరకు దగ్గరలోని రీహ్యాబిలిటేషన్ సెంటర్స్ ను సంప్రదిస్తే వీటిపై తగు సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరమని శిక్షార్హులని అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని,యువత మత్తుకు బానిస కాకుండా ముందుగానే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్గా ఎన్నికైన గణేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.