చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ , మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ కు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణ అరికట్టడం పై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ర్యాలీ ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలుఈ కార్యక్రమo ముఖ్య ఉద్దేశ్యం అనధికారిక డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణా పై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. రోగాలకు వాడే మందులను వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య రీత్యా వాడాలని వాటికి బానిసలుగా మారితే వాటివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి యువత వారి బంగారు జీవితాన్ని పాడు చేసుకోరాదని సూచించారు. స్కూల్స్ , కాలేజీలలో ఎవరైనా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాల వాడకం నుండి వారిని బయటకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు , స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంఘాలు సమభాగంగా మత్తుకు బానిసలైన వారి కేసులు తమ ద్రుష్టికి వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వాటి వినియోగం నుండి బయటకు తీసుకుని రావడానికి కృషి చేయాలని అన్నారు. స్కూల్, కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి మత్తు నుంచి విముక్తి కలిగించుట కొరకు సందేహాలు, సూచనల కొరకు దగ్గరలోని రీహ్యాబిలిటేషన్ సెంటర్స్ ను సంప్రదిస్తే వీటిపై తగు సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరమని శిక్షార్హులని అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని,యువత మత్తుకు బానిస కాకుండా ముందుగానే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 70870