234
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్’లో వెల్లడించారు. ఓ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు..యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్లోనే చిక్కుకుపోయారు. అక్కడ తాను క్షేమంగానే ఉన్నట్టు రెండ్రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే..గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రత్యేక విమానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఎయిర్పోర్టులకు చేరుకుంటున్నారు భారతీయులు.




Total views : 47725