దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని కటక్లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 57వ రైజింగ్ డే వేడుకల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి విముక్తి పొందుతుందని తేల్చి చెప్పారు. గతంలోనే ప్రకటించిన విధంగా మార్చి 3 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చాలనే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. ‘తిరుపతి నుంచి పశుపతి’ వరకు రెడ్ కారిడార్ను నిర్మించాలనే మావోయిస్టుల కలలు కల్లలవుతాయని ఆయన పేర్కొన్నారు.
నక్సలిజం పీడను వదిలించడంలో సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్ల కృషి అసామాన్యమని కొనియాడారు. భద్రతా దళాల పటిష్ట వ్యూహాల వల్ల నక్సల్స్ ప్రభావం ఇప్పుడు అతి తక్కువ ప్రాంతాలకు పరిమితమైందని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతూ, పాఠశాలలు, ఆసుపత్రులను ధ్వంసం చేసే మావోయిస్టుల పట్ల ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని అమిత్ షా హెచ్చరించారు. ఆయుధాలు పట్టిన వారికి ఆయుధాలతోనే సమాధానం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. మావోయిజం వల్ల దశాబ్దాలుగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయని, బస్తర్ వంటి ప్రాంతాలు అభివృద్ధికి చిహ్నాలుగా మారుతున్నాయని అమిత్ షా అన్నారు.





Total views : 47734