దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో 80కి పైగా దేశాల నేతలు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు పాల్గొన్నారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కృత్రిమ మేధ పాత్రపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తారు. సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐపై భారత్ విజన్ను, ప్రపంచ దేశాల సహకారంపై ఆయన తన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులు పాల్గొంటున్నారు.
ఈ సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఫర్ ఆల్’, ‘ఏఐ బై హర్’, ‘యువ ఏఐ’ పేర్లతో మూడు గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఛాలెంజ్లకు 60 దేశాల నుంచి 4,650కి పైగా అప్లికేషన్లు రావడం, బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలలో భారత్ గ్లోబల్ హబ్గా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.



Total views : 33568