Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by CVR NEWS

జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. 1.5 ఉన్న టీఎఫ్ఆర్‌ను 2.1కు తీసుకెళ్లటం మన లక్ష్యమని వెల్లడించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని ఈ నగదు పురస్కారం గేం ఛేంజర్ కానుందని భావిస్తున్నామని అన్నారు. జనాభా నిర్వహణపై ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని ఆ చర్చల తర్వాత పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని, పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

007281
Total views : 47768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.