Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

by Prakash
పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని అన్నారు. జూలై ఒకటవ తేదీన వాలంటీర్లతో ఇంటివద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతినే పాటిస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమని మంత్రి డోలా అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.