పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి న జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్. నేడు తన స్వగృహం లో జనసేన నాయకులు, జనసైనికులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతమా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి భాద్యతలు అప్పగించిన నాటి నుండి నేటి వరకు జనసేన పార్టీలో ఉన్నాం..కేంద్రం లో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్య మైన పార్టీ గా గుర్తింపుపొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావడం అలాగే ఎన్నికల్లో పోటి చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందిప్రతి గ్రామం మరియు ప్రతి గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టిల కి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ లు కలసి మహోత్తర మైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ పవణ్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందు కు కృషి చేస్తారని తెలియజేసేందుకు జనసైనికులు గా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమం లో పాముల హరి,చంద్ర, తిరుమలేషు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.