Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు హారం విరాళం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు హారం విరాళం

by Rama
శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు హారం విరాళం

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాదుకు చెందిన నూకల నటరాజ్ అనే భక్తుడు 375 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు లక్ష్మీ కాసుల రూపంతో తయారుచేసిన ఈ హారం విలువ సుమారు 24 లక్షల 41 వేల 433 రూపాయలు ఉంటుందని విరాళ భక్తుడు నటరాజ్ తెలిపారు అయితే హారాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుడు నటరాజ్ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఆలయ ఏఈవో హరిదాసు,ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ రామానాయుడుకు లక్ష్మి హారాన్ని అందజేశారు అనంతరం హారాన్ని విరాళంగా అందించిన భక్తుడు నటరాజ్ కుటుంబానికి ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవారి శేష వస్త్రాలు,శ్రీస్వామి అమ్మవారి చిత్రపట జ్ఞాపిక,లడ్డు ప్రసాదాలు అందజేసి సత్కరించారు……

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.