ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుందిమెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు రామాయంపేట గవ్వలపల్లి రహధారి శాలిపేట పాఠశాల ముందు రాస్తారోకోదిగారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూప్రాథమికోన్నత పాఠశాలను అప్ గ్రేట్ చేసి పదవ తరగతి వరకు చేసినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుందన్నారు.సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ స్పందన లేదని ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య తీర్చే వరకు తాము రాస్తారోకో విరమించమంటూ పాఠశాల ముందు రోడ్డు పైనే వంటావార్పు నిర్వహిస్తున్నారు. సుమారు గంట నుండి విద్యార్థులు గ్రామస్తుల రాస్తారోక కొనసాగుతూనే ఉంది.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్గా ఎన్నికైన గణేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.