Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Political హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

by Rama
Balakrishna

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. గత టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే, హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. అమాయకులను హత్యలు చేయించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపిపై ఆగ్రహించి కూటమిని గెలిపించారన్నారు. ఏపీలో అభివృద్దే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో 64 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.