హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. గత టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే, హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. అమాయకులను హత్యలు చేయించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపిపై ఆగ్రహించి కూటమిని గెలిపించారన్నారు. ఏపీలో అభివృద్దే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో 64 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.