144
విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్న లోకేష్… వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు