రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విడుదల చేస్తారు. చార్జిషీట్ను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేసి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు 92400 15247 నంబర్కు కాల్ చేయాలని బీజేపీ నేతలు కోరారు.
ఈరోజు చార్జిషీట్ విడుదల, 2, 3 తేదీల్లో అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేస్తారు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కనీసం రెండు వేల మంది సభ్యులతో సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి తీసుకు రానున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి