136
పెద్దపల్లి జిల్లాలో శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి మండలం పెద్ద కలువలలో శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం 11వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహా యాగ కార్యక్రమానికి వివిధ పీఠాధిపతులైన జగద్గురు శ్రీ శ్రీ డాక్టర్ శ్రీకాంత్యేంద్ర స్వాములు, శ్రీమద్ నందికొండ జగద్గురు కాళహస్యతచార్యా సంస్థానం, శ్రీ గాయత్రి పీఠం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.లోక కళ్యాణం కోసం చేసే ఈ చండీయాగం రైతులకు రాష్ట్ర ప్రజలకు గ్రామ ప్రజలకు సకల శుభాలు ఇస్తుందంటూ పీఠాధిపతులు పేర్కొన్నారు.




Total views : 47778