Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Political ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

by Satya
ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌గా రివ్యూలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు. తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 30 నిమిషాలు పాటు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పీసీసీ నూతన కార్యకవర్గం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కుల గణన అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్లు తెలిసింది.
ప్రభుత్వం గత పది నెలలుగా చేపట్టిన 6 గ్యారంటీలు, రుణ మాఫీ, ఉద్యోగాల నియామకాలు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలను కేసీకి వివరించారు. పార్టీ యాక్టివిటీస్, నేతల పనితీరు‌పై కూడా చర్చించారు. ఇక జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై కూడా చర్చించినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి రాసిన లేఖపై కూడా కేసీ అడిగి తెలుసుకున్నారు. పార్టీలో సమన్వయం, సమర్ధత వంటివి అవసరమని కేసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు సూచించారు. నేతలందరితో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర పీసీసీ చీఫ్‌కు సూచించారు. పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత 50 రోజుల పాటు నిర్వహించిన పార్టీ ప్రోగ్రామ్స్‌పై కూడా కేసీ ఆరా తీశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రాసిన బుక్ ఆవిష్కరణకు పీసీసీ చీఫ్​హాజరు కానున్నారు. ఆ మీటింగ్ తర్వాత పలువురు ఏఐసీసీ అగ్రనేతలను మహేష్​కుమార్ గౌడ్ కలవనున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి మహరాష్ట్రకు వెళ్లి పనిచేస్తున్న కార్యకర్తల గురించి హైకమాండ్ వివరించనున్నారు. మరోవైపు కొత్త పీసీసీ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి. స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయి‌లో కమిటిలన్నీ కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం పార్టీ పవర్‌లో ఉంది. పార్టీ, ప్రభుత్వంతో సంపూర్ణమైన సమన్వయంతో పని చేసే వ్యక్తులనే ఎంపిక కేసీ పీసీసీ చీఫ్‌కు ఆదేశాలిచ్చారు.
త్వరలో తెలంగాణ‌లో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని కేసీ వేణుగోపాల్ పీసీసీకి వివరించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా అర్ధ రహిత, అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని మహేష్​ కుమార్ గౌడ్‌కు సూచించారు. సోషల్ మీడియా టీమ్‌లకు మరింత యాక్టివ్‌గా తయారు చేయాలన్నారు. అవసరమైతే బెంగళూరు‌లోని ఏఐసీసీ సోషల్ మీడియా టీమ్‌ల సహకారాన్ని తీసుకోవాలని కేసీ పీసీసీ‌కి సూచించారు. గాంధీ భవన్ వార్ రూమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీ.. ఎన్నికల టాస్క్ తరహాలోనే పని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023059
Total views : 140808

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.