Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Andhra PradeshChittoor వెలకట్టలేని అభిమానం చాటుకున్న చిన్నారులు..

వెలకట్టలేని అభిమానం చాటుకున్న చిన్నారులు..

by Rama
Amarnath Reddy

చిత్తూరు జిల్లా.. గంగవరం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) పై తమ వెలకట్టలేని అభిమానాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళ్తే… గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలోని గుండ్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి నాలుగు నెలల క్రితం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన జయరామి రెడ్డి కుమార్తెలు గీతిక మరియు షాలినీలు తమ పొదుపు చేసి దాచుకున్న (కిడ్డి బ్యాంకు) హుండీ సొమ్మును ఆయనకు అందించి ఈ సొమ్మును నామినేషన్ కొరకు వాడుకోవాలని కోరారు. దీంతో చిన్నారులు అభిమానంగా అందించిన ఆ హుండీని దేవాలయంలో పూజల అనంతరం పగలగొట్టి అందులోని రూ.4701 సొమ్మును నామినేషన్ దరఖాస్తు సొమ్ము కొరకు వాడుకొని ఆ చిన్నారుల కోరికను తీర్చారు. ఈ అంశాన్ని చూసిన పలువురు ఓ వైపు చిన్నారుల అభిమానం వెలకట్టలేనిదైతే, ఆ అంశాన్ని నాలుగు నెలల తర్వాత కూడా గుర్తుంచుకొని మాజీ మంత్రి వారి కోరికను తీర్చడం గొప్ప విషయమని కొనియాడారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…
    జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు… హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్టు, ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు. సైబరాబాద్‌…
  • దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….
    దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను…
  • మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..
    మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

004897
Total views : 33611

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.