ముంబై ఇండియన్స్ (Mumbai Indians) :
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 9 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైనే వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకొచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీయగా.. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ 6, ప్రభ్సిమ్రాన్ సింగ్ 0, రూసో 1, లియామ్ లివింగ్స్టోన్ 1, హర్ప్రీత్ సింగ్ భాటియా13, శంకర్ సింగ్ 41, జితేశ్ శర్మ9, ఆశ్తోశ్ శర్మ 61, హర్ప్రీత్ బ్రార్ 19, కగిసో రబాడ 8 అర్షదీప్ సింగ్ 1 చొప్పున పరుగులు చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
- ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా…
- యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ …ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…





Total views : 78967