ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యిందని.. గూగుల్ ఎంవోయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు.
మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పడు వారితో ఒప్పందం చేసుకున్నామని.. గూగుల్తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖకు గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని.. ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తు పెట్టుకోవాలి.. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు కచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ చాలా ముఖ్యం అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్గా ఎన్నికైన గణేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి