ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష జరిపారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కిసాన్ సెజ్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లా గంగపట్నంలోచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.
126
previous post




Total views : 202966