వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి. నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చుతామని వైసీపీ హయాంలో పనులు ప్రారంభించినా సకా లంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రా క్టర్లు చేతులె త్తేశారు. ఇలాంటి స్కూళ్లు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని స్కూళ్లలో బాత్రూములు అసంపూర్తిగా ఉంటే మరికొన్ని స్కూల్ బిల్డింగులు స్లాబ్ వరకు వచ్చి నిలిచిపోయాయి. కొన్ని స్కూళ్లకు ఫెన్సింగ్ వాల్ లేదు. పాఠశాలల్లో గదులు సరిపోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలం సీతారాంపురం జడ్పీ హైస్కూల్,SNS హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్ తూర్పుతాడళ్ళు జడ్పీ హైస్కూల్, మల్లవరం స్కూళ్ల భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వమైనా ఈ అసంపూర్తి భవనాలు పూర్తి చేసి విద్యార్థుల కష్టాలు కడతేర్చాల్సిన అవసరం ఉంది.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు.
133
previous post



Total views : 202975