ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయిందని.. భవిష్యత్తులో మానవ వనరుల కొరత, వృద్ధాప్య సమస్యలను అధిగమించాలంటే ఈ కొత్త పాలసీ తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. ఇదే వేదికపై రాష్ట్రాభివృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం ‘ప్రాజెక్టు సంజీవని’, విద్యార్థుల కోసం ‘ఏఐ లెర్నింగ్’ వంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.
147




Total views : 203015