Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home TelanganaKarimnagar వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి కార్మికులను ఆదుకోవాల్సిందే..

వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి కార్మికులను ఆదుకోవాల్సిందే..

by Rama
Bandi Sanjay Kumar

సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ మేరకు ఆయా నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, మిగిలిన బకాయిలను సైతం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొత్త ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని కోరారు. వీటితోపాటు పవర్ లూం కార్ఖానాలకు గత 30 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను పునరుద్దరించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని మనవి. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో బీజేపీ పక్షాన మళ్లీ ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
  • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..
    శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో స‌మావేశ‌మైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాలు, నీటి నిల్వలు, విడుద‌ల‌పై అధికారులు చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
  • జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..
    రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

012218
Total views : 74521

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.