మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితుల ఇళ్ళను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి, బిజిపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులకు భరోసా ఇస్తూ ఇప్పటికే కిషన్ రెడ్డితో సహా బిజెపి నాయకులు పలుమార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పర్యటనలతో ఏం రాదని వారి కష్టాలు తెలియాలంటే వారితో గడపాలని సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన బిజెపి.. బస్తీ నిద్రకు పిలుపునిచ్చింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ బస్తీ నిద్ర సాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇరవై ప్రాంతాలలో బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ బస్తీ నిద్ర చేస్తున్నారు. బిజెపి చేస్తున్న బస్తీ నిద్ర ద్వారా మూసీ పరివాహక ప్రాంత వాసులకు భరోసా కలిగిస్తామంటున్న కేంద్ర మంత్రి, బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సత్తిరాజు ఫేస్ టూ ఫేస్….
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి