అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన డ్రామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆల్ రెడీ ఆదానీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఏడాది పాలనలో ఎటువంటి లోపాలు లేనందు వల్లే .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపాలి గానీ..ఈ విధంగా చేయడం సరికాదన్నారు. పాలనలో ఏవైనా లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుకుంటామని, కానీ అవేమీ లేనందువల్లే బీఆర్ఎస్ డ్రామాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో ఎన్నికల్లో ఇఛ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ ఎక్కడ తమకు మైలేజీ వస్తుందోనని భావించి.. అనవసరమైన ఆందోళనలకు దిగుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు కట్టిపెట్టి.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్ధతు పలకాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి