Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లా పరవాడలో వెలుగులోకి భారీ మోసం..

అనకాపల్లి జిల్లా పరవాడలో వెలుగులోకి భారీ మోసం..

by CVR NEWS

అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మోసం వెలుగులోకొచ్చింది. బండారు రామారావు చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారని స్థానికులు. మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులే ఆయన ప్రధాన బాధితులుగా ఉన్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొదట చిన్న మొత్తాలతో నమ్మకంగా ఉన్న నిందితుడు..తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడని అంటున్నారు బాధితులు. వసూలు చేసిన మొత్తం దాదాపు రూ.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు పరారవడంతో డబ్బులు కోల్పోయిన బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐతే ఆయనపై ఇప్పటికే గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..నిందితుడిని విజయనగరం ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

007284
Total views : 47774

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.