Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Telangana తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

by Rama
తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 వేల 372 మంది దీని బారిన పడ్డారు. జూన్‌ నెలాఖరు వరకు ఒకవేయి78 మందికి నిర్ధారణవగా, గత రెండు నెలలుగా 4వేల 294 నమోదయ్యాయి. డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగ్యూకేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. చికున్‌ గున్యా ఉందన్న అనుమానంతో 2 వేల 673 నమూనాలను పరీక్షించగా 152 కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ. దీనికి సంబంధించి 5శాతం పాజిటివిటీ ఉంటోంది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బయటపడుతున్నాయి. డెంగ్యూకి కారణమయ్యే టైగర్‌ దోమ మంచి నీటిలో పెరిగి.. ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.