192
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బోనాల ఉత్సవాలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, హిందూ పండుగలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే రాబోయే గణేష్ ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలకు తగిన నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.