Monday, March 16, 2026
News Navigation

Breaking

Monday, March 16, 2026
Home Andhra Pradesh టీడీపీ కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం..!

టీడీపీ కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం..!

by Satya
DRONE

ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో టీడీపీ కార్యాలయాన్ని షూట్ చేసి, ఆ తరువాత కార్యాలయం లోపలకు పంపే క్రమంలో డ్రోన్ కింద పడిపోయింది.

అప్రమత్తమయిన టీడీపీ నాయకులు నవీన్ ను పట్టుకుని పోలీస్ లకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తన ప్రచారాన్ని ముగించుకుని యర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులతో మాట్లాడి..అనుచరులతో కలసి శనివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు.

ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ తో మాట్లాడుతూ వైసీపీ కి చెందిన వారు ఉద్దేశ పూర్వకంగానే డ్రోన్ కెమెరా ను టిడిపి కార్యాలయం లోకి పంపే ప్రయత్నం చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ క్రమంలో టీడీపీ నాయకులు తమ నాయకుడు ఎరిక్షన్ బాబు కు హాని చేయాలనే ఉద్దేశంతో నే వైసీపీ కి చెందిన వారు పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం కు చెందిన నవీన్ తో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలైన సూత్ర దారులను గుర్తించాల‌ని సిఐ కు తెలిపారు.

డ్రోన్ ఎగుర వేసిన నవీన్ పై పోలీస్ లు కేసు నమోదు చేసారు. అర్ధరాత్రి ఎరిక్షన్ బాబు అనుచరులతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళటంతో రాజకీయ వేడిని రాజేసినట్లయింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం
    శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు భృంగి వాహన…
  • తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది.
    తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ…
  • తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
    తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.