103
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. దేవస్థానం ఈఓ ఎన్.ఎస్. చక్రధరరావు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో 27వ తేదీ రాత్రి సత్యదేవుని ధివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, విద్యుత్ అలంకరణ, వైదిక కార్యక్రమాలు, రథోత్సవం వంటి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని.. భక్తులందరికీ సౌకర్యాలు కల్పించేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.





Total views : 81449