తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల హాల్ టికెట్లను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు TGPSC అధికారిక ప్రకటన జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 15 వ తేదీన పేపర్ 1, పాపేర్ 3… 16 వ తేదీన పేపర్ 2, పేపర్ 4 నిర్వహిస్తున్నారు. హాల్టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TGPSC తాజా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీకి గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన గత ప్రభుత్వం జారీ చేసింది.
2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్. దీనిపై స్పదించని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటుంది.
అభ్యర్థుల బాధను పట్టించుకోకుండా మొండి వైఖరితో పరీక్షలు నిర్వహిస్తుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
- ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలుఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ…
- టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్రTTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర. ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర..ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి