సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ యంత్రాలు సైతం మూలకు పడ్డాయి. ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ బురద కావడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా 23 భూగర్భ గనులు, 19 ఉపరితల గనులు ఉన్నాయి. అందులో భూగర్భ గనుల నుంచి 20శాతం, ఉపరితల గనుల నుంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల వర్షాలతో ఉత్పత్తికి అంతరాయంతో పాటు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్న బొగ్గు రవాణా కూడా స్తంభించిపోయింది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో 1, 46, 595 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గితేనే తిరిగి యధావిధిగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా…
- ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలుఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 47742