498
ఎన్నికల వేళ హైదరాబాద్(Hyderabad) లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. కీసర ప్రధాన మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. మోటారు వాహనంపై తరలిస్తున్న వ్యక్తి నుంచి ఈ డబ్బును రికవరీ చేశారు. అయితే దాదాపు 18 లక్షల రూపాయలను ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తరలిస్తుండంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశామని తెలిపారు. అక్రమంగా నగదును తరలిస్తున్న సాయికుమార్, కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో హృదయవిదారక ఘటన.హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరి… తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధను బైరామల్గూడ చెరువులో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…
- అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
- హైదరాబాద్లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.