118
ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. టొబెలోకు పశ్చిమాన సుమారు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు భూకంప పరిశీలన సంస్థలు వెల్లడించాయి.భూకంపం కారణంగా పలుచోట్ల ప్రకంపనలు తీవ్రంగా అనిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.