Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది.

ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది.

by CVR NEWS

ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది. కాగా తొలుత టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. అజింక్య రహానే (67), ఫిన్ అలెన్ (37), రఘువంశీ (51), రింకూ సింగ్ (33), గ్రీన్ (18) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, హార్దిక్ ఒక వికెట్ తీశారు. అనంతరం 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ (81), రోహిత్ (78) తిలక్ (20) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కోల్కతా బౌలర్లలో అనుకుల్, వైభవ్, కార్తీక్, సునిల్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో ఈ సీజన్లో ముంబై బోణి తెరవగా.. కోల్కతా మొదటి మ్యాచులోనే ఓటమి చవి చూసింది.

Advertisements

You may also like

Our Visitor

007291
Total views : 47785

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.