Monday, March 16, 2026
News Navigation

Breaking

Monday, March 16, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

by Rama
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. స్వామి వారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విఐపి విరామ సమయంలో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రినిసిపల్ సెక్రటరీ యశోదలతో కలసి శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి పదాల చెంత ఇస్రో టీం SSLV D3 EOS08 నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇస్రో టీం SSLV D3 EOS08 నమూనాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం
    శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు భృంగి వాహన…
  • తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది.
    తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ…
  • తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
    తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
  • ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది.
    ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ‍ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ‍ప్రజలే. అయితే ఈ యుద్దం…
  • నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
    నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.