102
జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. డీఐజీ శివకుమార్ శర్మ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.





Total views : 81449