కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల. హైకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుతంనివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..మారిపోయింది. గ్రామానికి చెందిన నాయకుడు వెంకటప్పనాయుడు హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2008వ సంవత్సరం మే 17న కప్పట్రాళ్లకు చెందిన వెంకటప్పనాయుడు హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థుల దాడిలో ఆయనతోపాటు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దేవనకొండ మండలం బోదెపాడు వద్ద లారీతో ఢీకొట్టి మరీ హత్య చేశారు.
ఆ వ్యవహారంలో మొత్తం 42 మందిపై హత్య కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత 2014 డిసెంబర్ 10న 21 మందికి నంద్యాల కోర్టు జీవిత ఖైదు విధించింది. వారిలో నలుగురు అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత ఆదోని కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. మరో 9 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 17 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. వారిలో కీలక నిందితులు మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు కూడా ఉన్నారు. దీంతో కప్పట్రాళ్ల గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. విషయాన్ని ముందే ఊహించిన పోలీసులు గ్రామంలో బందోబస్తు పెంచారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి