Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh ఆంధ్ర నుంచి తెలంగాణకు భారీగా గంజాయి పట్టివేత..

ఆంధ్ర నుంచి తెలంగాణకు భారీగా గంజాయి పట్టివేత..

by Satya
Massive seizure of ganja from Andhra to Telangana

ఆంధ్రాలోని నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ(Telangana) జిల్లాల్లోకి భారీ స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అశ్వారావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీ కి చెందిన బొలెరో వాహనంలో 165 బ్యాగుల్లో 359 కిలోల గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి 11 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనసకాయలు రవాణా నెపంతో భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న 359 కేజీల గంజాయి విలువ సుమారు 89 లక్షల 83 వేలు ఉంటుందని అంచనా. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఎస్సై తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.