Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన.

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన.

by CVR NEWS
రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన

రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీంతో దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో, దాదాపు 79 వేల 450 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు.
వార్షికంగా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రిఫైనరీని రూపొందించారు. ఇది పశ్చిమ రాజస్థాన్‌లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేవలం రిఫైనరీనే కాకుండా రాజస్థాన్‌లో దాదాపు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 13,000 కోట్ల జైపూర్ మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన, రూ. 480 కోట్లతో నిర్మించిన జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌ నూతన టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం, సవరించిన ‘ఉడాన్’ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ప్రారంభం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా, వేడుక వేదికగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన సుమారు 54,000 మంది అభ్యర్థులకు ప్రధాని నియామక పత్రాలను పంపిణీ చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040023
Total views : 202991

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: