Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Latest News ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.

by CVR NEWS

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇంకా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వ్యవసాయం, క్రీడలు, మౌలిక సదుపాయాలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలకు లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది. రైతుల సంక్షేమం నుంచి దేశ మౌలిక వసతుల అభివృద్ధి వరకు విస్తృత అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది.ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు వేడిగా కొనసాగుతున్న వేళ.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ప్యాకేజీ రేట్ల సమీక్షపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై విస్తృత చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్, సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య సహాయం ఎప్పుడు వచ్చినా వెంటనే అందేలా 24 గంటల ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఆరోగ్య పథకంలో మెరుగైన మార్పులు తెస్తోందని, దీని ద్వారా వేలాది మంది ఉద్యోగ, పెన్షనర్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: