న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ విధానాలు, ఇంటింటి చెత్త సేకరణ, 4-వే సోర్స్ సెగ్రిగేషన్, ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్, పాత డంప్యార్డుల బయోమైనింగ్, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు, ఆర్ఆర్ఆర్ కేంద్రాలు, ఈ-వేస్ట్ సేకరణ, కిటాక్యుషు మోడల్లో ఎకో టౌన్ ఏర్పాటు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకర్ అందిస్తారు.
ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..
89
previous post





Total views : 143667