Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

by Rama
ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అమావాస్య వచ్చిందంటే క్షుద్ర పూజలతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అమావాస్య కావడంతో పలు ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానికులు గుర్తించారు. తుంబూరు, భీమవరం రోడ్ లో క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానిక ప్రజలతోపాటు, పంట పొలాలకు వెళ్లే రైతులు కలవరపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం క్షుద్ర పూజలు చేస్తూ ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంతో మంత్రగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కళాజాత బృందాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
    తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
  • ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
    ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
  • ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
  • మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
    మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
  • రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..
    గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

004889
Total views : 33585

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.