Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home National స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని

by Satya
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా 11వ సారి మోదీ ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్‌ ధరించారు. రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు వైవిధ్య భరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని .ఇవాళ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి తోక కూడా ఈ మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని తయారు చేశారు. ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.

ఇక గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇక అంతక్రితం ఏడాది2022లో ఎరుపు రంగు నమూనా, కుంకుమ పువ్వు రంగు రంగులో ఉన్న పొడవాటి తోక ఉన్న తలపాగాను మోదీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

005710
Total views : 38455

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.