దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా 11వ సారి మోదీ ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్గాలా జాకెట్ ధరించారు. రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు వైవిధ్య భరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని .ఇవాళ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి తోక కూడా ఈ మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ టెక్స్టైల్ టెక్నిక్తో దీనిని తయారు చేశారు. ఈ లెహెరియా డిజైన్ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.
ఇక గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇక అంతక్రితం ఏడాది2022లో ఎరుపు రంగు నమూనా, కుంకుమ పువ్వు రంగు రంగులో ఉన్న పొడవాటి తోక ఉన్న తలపాగాను మోదీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి