రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినలగచర్ల భూ సేకరణ వ్యవహారంపై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కాసేపటి అధికారులు విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం లగచర్లలో భూ సేకరణ విషయంలో వెనక్కి తగ్గింది. ఫార్మాసిటీ కోసం భూ సేకరణ నోటిఫికేషన్ నిలిపివేస్తూ ప్రకటన జారీ చేసింది. అందువల్ల లగచర్లలో రైతుల పోరాటం ఫలించినట్లే. ఇక వారు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సేకరణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఐతే.. దీనిపై రైతులు, స్థానికులతో మాట్లాడిన తర్వాతే.. సేకరణ చెయ్యనుంది. మొన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా.. దిలావర్పూర్, గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడి ప్రజల డిమాండ్కి తలొగ్గింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా.. లగచర్ల గ్రామంలో కూడా భూ సేకరణను రద్దు చేసుకుంది. తద్వారా.. అక్కడ ఫార్మాసిటీ ఇక రానట్లే అనుకోవచ్చు. ప్రజల వ్యతిరేకను గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 38424