ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మరణించారు. అరటితోటలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించగా..5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం దగ్గర 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం పుట్లూరు మండలం ఎల్లుట్లో విషాదాన్ని నింపింది. ఎల్లుట్ల నుంచి 60కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లిలో అరటితోటలో పని చేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. తోటలో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు కబళించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఐదుగురు మరణించారు. ప్రమాదంలోమరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. వీరంతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే వీధికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి