విజయవాడకు సుజనా చౌదరి (Sujana Chowdary) పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, ఎవరూ నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేశారని, సుజనా కుటుంబాలు విజయవాడ లోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. పోతిన మహేష్ మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువలేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పోతిన బేస్ కంఠేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బెవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం…
- ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి…
- శ్రీకాకుళం అమృత హాస్పిటల్ అక్రమాలపై సర్కారు సీరియస్..శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది మీది హంగులే తప్ప.. లోపల అత్యవసరమైన ఫైర్ సేఫ్టీ వసతులు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే…




Total views : 38404