తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధ ర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు. సీఎం రేపంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మూడో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండోస్థానంపై రాత్రి క్లారిటీ వచ్చింది. చర్చలు, సం ప్రదింపుల తర్వాత వేం సరేందర్రెడ్డి పేరుసు ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థి త్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో మొదటి స్థానాని కి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తరఫున ఎవరూ పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ
గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావు. కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంతమంది ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో 2024 ఎన్నికల్లో మేము విజయం సాధించి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ముప్పై సంవత్సరాలకు పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగి విరమణ అనంతరం వృద్దాప్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని అందులో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా భవన్లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం వృధ్యాప్య భద్రత అవసరమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా పెన్షన్ అందజేయాలని కాంగ్రెస్ భావించి ఆ దిశగా కట్టుబడి ఉందన్నారు. అందులో బాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థల మేలుకోసమే సీపీఎస్ విధానం వచ్చిందని ఉద్యోగుల మేలుకోసం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణ తొందరలోనే చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ తో 19 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న రెండు లక్షల ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా పాత పెన్షన్ పునరుద్దరణకు కృషిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్, జిల్లా కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, సందుపట్ల రమేష్, బండారి సతీష్, కొణతం నగేష్, కేశెట్టి నవీన్, అనుమాండ్ల నరేందర్, నాంపల్లి హరికృష్ణ, కొత్త వంశీ, గుండా శ్రావణ్,భక్తుల రమేష్, సిర్ర శ్రీనివాస్, ఏగ్యారపు వెంకటేష్, మహేందర్ అపెక్స్ హాస్పిటల్ యాజమాన్యం రమేష్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలోని అల్లావుద్దీన్ కోటి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో అక్రమ అవినీతి పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. నగరం నడి ఒడ్డున గల అల్లావుద్దీన్ కోటి ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. మైనార్టీలపై ప్రభుత్వంకు ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని ప్రకటించారు. మైనార్టీ వర్గాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ అభివృద్ధికి , వారి సంస్కృతి పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల వారికి విద్య , కనీస ఆదాయంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రకటించారు.
డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ అయి ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని సీఎం ప్రసంగించారు.దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ అని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి డిండి ప్రాజెక్టు కోసం, ఇక్కడి వ్యవసాయం, నీళ్ల గురించే మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీల నాయకులే స్టేలు తీసుకురావడంతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది. ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి. కేంద్ర ప్రభుత్వం 10 ఏండ్ల సమయం తీసుకుని, మొన్న నేను చెడామడా తిట్టిన తర్వాత ఈ మధ్యనే దాన్ని ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్తవుతుంది అన్నారు.
గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా. పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తన స్పష్టమైన హామీ అని అన్నారు.
ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముసలం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనారు. ఈరోజు చౌటుప్పల్ తన క్యాంపు కార్యాలయంలో మరోసారి కార్యకర్తల సమావేశం నిర్వహించి, వారి సలహాలు స్వీకరించి, మునుగోడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు.




Total views : 74516