తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను తిరిగి పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి ఆధునిక చిత్రాల వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సందేశాత్మక చిత్రాలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో గొప్ప మార్పులకు నాంది పలికాయని కొనియాడారు. అవార్డుల ఎంపికలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత పారదర్శకంగా విజేతలను నిష్పక్షపాతంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ వ్యక్తి కాదు వ్యవస్థ.. తెలంగాణ ఆటని, పాటని, ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప కళాకారుడని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, కళాకారులకు మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
#awards
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్ పురస్కారాలను అందుకుంది. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు. మొత్తం 13 విభాగాల్లో ఈ సినిమా అవార్డులకు నామినేట్ కాగా…. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆరు పురస్కారాలు అందుకుంది. ఆ తర్వాత సిన్నర్స్ చిత్రం కూడా ఈ సారి సత్తా చాటింది. ఈ చిత్రం హీరో మైఖేల్ జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఫ్రాంకెన్ స్టెయిన్ చిత్రం మూడు అవార్డులు, కేపాప్ డీమాన్ హంటర్స్ రెండు అవార్డులను సాధించింది.
మరోవైపు ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో… గత ఏడాది కన్నుమూసిన ప్రముఖ నటులను స్మరించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొన్న నటీనటులకు ఆస్కార్ నివాళులర్పించింది. ఇందులో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. వీరందరి పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. జీ20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోడీ అక్కడి నుంచి నైజీరియాలో పర్యటించగా.. అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన GCON అవార్డుతో సత్కరించింది. మరో రెండు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో మోడీని సత్కరించనున్నట్లు తెలిపాయి. గయానా దేశం తమ దేశపు హయ్యస్ట్ అవార్డ్ అయిన ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్లెన్సీ’తో మోడీని సత్కరించబోతున్నామని చెప్పగా.. బార్బడోస్ కూడా తమ అత్యున్నత పురస్కారం ‘హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ను మోడీకి అందించనున్నామని వెల్లడించింది. కొవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లు అందజేసి సాయం చేసినందుకు గానూ ఈ రెండు దేశాలూ కృతజ్ఞతతో అవార్డులు అందిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 38491