తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను తిరిగి పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి ఆధునిక చిత్రాల వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సందేశాత్మక చిత్రాలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో గొప్ప మార్పులకు నాంది పలికాయని కొనియాడారు. అవార్డుల ఎంపికలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత పారదర్శకంగా విజేతలను నిష్పక్షపాతంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ వ్యక్తి కాదు వ్యవస్థ.. తెలంగాణ ఆటని, పాటని, ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప కళాకారుడని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, కళాకారులకు మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
#awards
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్ పురస్కారాలను అందుకుంది. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు. మొత్తం 13 విభాగాల్లో ఈ సినిమా అవార్డులకు నామినేట్ కాగా…. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆరు పురస్కారాలు అందుకుంది. ఆ తర్వాత సిన్నర్స్ చిత్రం కూడా ఈ సారి సత్తా చాటింది. ఈ చిత్రం హీరో మైఖేల్ జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఫ్రాంకెన్ స్టెయిన్ చిత్రం మూడు అవార్డులు, కేపాప్ డీమాన్ హంటర్స్ రెండు అవార్డులను సాధించింది.
మరోవైపు ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో… గత ఏడాది కన్నుమూసిన ప్రముఖ నటులను స్మరించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొన్న నటీనటులకు ఆస్కార్ నివాళులర్పించింది. ఇందులో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. వీరందరి పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. జీ20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోడీ అక్కడి నుంచి నైజీరియాలో పర్యటించగా.. అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన GCON అవార్డుతో సత్కరించింది. మరో రెండు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో మోడీని సత్కరించనున్నట్లు తెలిపాయి. గయానా దేశం తమ దేశపు హయ్యస్ట్ అవార్డ్ అయిన ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్లెన్సీ’తో మోడీని సత్కరించబోతున్నామని చెప్పగా.. బార్బడోస్ కూడా తమ అత్యున్నత పురస్కారం ‘హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ను మోడీకి అందించనున్నామని వెల్లడించింది. కొవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లు అందజేసి సాయం చేసినందుకు గానూ ఈ రెండు దేశాలూ కృతజ్ఞతతో అవార్డులు అందిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141780